Goush alam: ఎన్నికలకు పటిష్ట బందోబస్తు:  ఎస్పీ గౌష్ ఆలం

సిరాన్యూస్, ఆదిలాబాద్‌
ఎన్నికలకు పటిష్ట బందోబస్తు:  ఎస్పీ గౌష్ ఆలం
సమర్థవంతంగా ఎన్నికలను నిర్వహించాలి
* క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు, స్ట్రాంగ్ రూముల వద్ద కేంద్ర బలగాలతో పహారా

మే 13 న జరగనున్న పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో 599 పోలింగ్ ప్రాంతాలు, అందులో 783 పోలింగ్ బూతు లు ఉన్నట్లు పోలింగ్ లొకేషన్లు, 87 రూట్ల వద్ద, జిల్లాలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్ల వద్ద, స్ట్రాంగ్ రూమ్ ల వద్ద, ఆదిలాబాద్ , బోథ్ నియోజకవర్గాలలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు. సిబ్బందికి అవగాహన కల్పించడానికి శ‌నివారం స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయం లో జిల్లా పోలీసు అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల విధులలో పాల్గొంటున్న సిబ్బందికి చేయవలసిన విధులపై ముందుగానే తెలియజేయాలన్నారు. ప్రతి ఒక్కరి వద్ద సంబంధిత రూట్ మొబైల్ వాహనం అధికారి మరియు ఉన్నతాధికారుల నంబర్లను తెలియజేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద వంద మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలియజేశారు. క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో మరియు మావోయిస్టు ప్రభావిత పోలింగ్ స్టేషన్ల లో, ఈవీఎం స్ట్రాంగ్ రూముల వద్ద కేంద్ర బలగాలతో పహారాను నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయబడిన స్ట్రాంగ్ రూముల వద్ద మూడంచల భద్రతను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కు 48 గంటల ముందు చేయవలసిన కార్యాచ‌ర‌ణ‌ పై అధికారులకు సూచనలు ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా సిబ్బంది ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహిస్తూ ఎటువంటి డబ్బు, మద్యం, ఇతర బహుమతి వస్తువులు అక్రమ రవాణా జరగకుండా చూడాలన్నారు. పోలింగ్ సెంటర్ల వద్ద విధులు నిర్వర్తించే సిబ్బంది ప్రజలను క్యూ లైన్లలో ఉండే విధంగా చూడాలన్నారు. పోలింగ్ కేంద్రంలోనికి మొబైల్ ఫోన్లు, వాటర్ బాటిల్స్, ఇంక్, పెన్, మంటను కలిగించే వస్తువులకు అనుమతి లేదని తెలియజేశారు. సిబ్బంది ప్రతి ఒక్కరు లాటి లను వెంట ఉంచుకోవాలని సూచించారు. ఈ ఎన్నికల బందోబస్తులు దాదాపు 1100 జిల్లా పోలీసులు, 400 ఇతర శాఖలకు సంబంధించిన పోలీసులు, 27 సెక్షన్ల కేంద్రబలగాలు, 15 సెక్షన్ల స్పెషల్ పోలీసులు పాల్గొన్నట్లు తెలియజేశారు. ఈ సమావేశం నందు అదనపు ఎస్పీలు సి సమైజాన్ రావు, బి సురేందర్ రావు, డీఎస్పీలు ఎల్ జీవన్ రెడ్డి, పోతారం శ్రీనివాస్, బి ప్రకాష్, బి సురేందర్ రెడ్డి, సిహెచ్ నాగేందర్, హసీబుల్లా, జిల్లాలోని సిఐలు, ఎస్సైలు, రిజర్వ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *