Goush alam: సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి

సిరా న్యూస్, ఆదిలాబాద్‌
సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి
* జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్
* పరిశోధనలలో నాణ్యత ప్రమాణాలను పాటించాలి
* నెలవారి నేర సమీక్ష సమావేశం
కేసుల దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరంలో ఆదిలాబాద్ సబ్ డివిజనల్ పోలీస్ అధికారులతో నెలవారి నేర సమీక్ష సమావేశాన్ని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కేసుల దర్యాప్తునందు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని కేసులలో పురోగతిని త్వరగా సాధించి కోర్టుల లో చార్జి షీట్ దాఖలు చేయాలని సూచించారు. ముఖ్యంగా కేసుల దర్యాప్తులో సీసీటీవీల పరిశీలన, సెల్ ఫోన్ ఆధారంగా నేరస్తులను పసిగట్టి సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి నేరస్తులకు శిక్షలు పడేవిధంగా దర్యాప్తు ను కొనసాగించాలని సూచించారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలను వాటి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు కేసులో దర్యాప్తును పూర్తి చేస్తూ కోర్టులను చార్జిషీట్ దాఖలు చేయాలని సూచించారు. ఫోక్సో, ఎస్సీ ఎస్టీ కేసుల నేరస్తులను కోర్టుల లో హాజరు పరిచి రెండు నెలల లోపు దర్యాప్తు పూర్తి చేయాలన్నారు. ముఖ్యమైన కేసుల నందు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. గాంజా కేసులలో ప్రత్యేకంగా కోర్టు నిర్దేశించిన విధానం ప్రకారం దర్యాప్తును కొనసాగించాలని సూచించారు. కేసులలో సెల్ఫోన్ ఆధారితంగా ఫారెన్సీ లాబరేటరీ కారణంగా పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను తెలుసుకొని త్వరితగతిన పూర్తి అయ్యే విధంగా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. అదేవిధంగా వర్టికల్స్ పై సమీక్ష నిర్వహించి సిబ్బందికి సూచనలు చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఆపరేషన్స్ బి సురేందర్ రావు, డీఎస్పీలు ఎల్ జీవన్ రెడ్డి, పి శ్రీనివాస్, సురేందర్ రెడ్డి, సిఐ లుకే సత్యనారాయణ, అశోక్, డి సాయినాథ్, పి చంద్రశేఖర్, కే ఫణిధర్, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *