Goush alam: ప్ర‌శాంతంగా బ‌క్రీద్ పండుగ‌ను జ‌రుపుకోవాలి: ఎస్పీ గౌష్ ఆలం

సిరాన్యూస్‌, ఆదిలాబాద్
ప్ర‌శాంతంగా బ‌క్రీద్ పండుగ‌ను జ‌రుపుకోవాలి: ఎస్పీ గౌష్ ఆలం
* కుటుంబ స‌మేతంగా ఈద్గా మైదానం వ‌ద్ద‌ ప్రార్ధనలు

ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో బ‌క్రీద్ పండుగ‌ను జ‌రుపుకోవాల‌ని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌష్ ఆలం అన్నారు. సోమ‌వారం
బక్రీద్ పండుగను పుర‌స్క‌రించుకొని కుటుంబ సమేతంగా జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఆదిలాబాద్ ఈద్గా మైదానంలో పవిత్ర ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఖుర్బానీ జరిపే సమయంలో పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని తెలిపారు. ఎవరికి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఎస్పీ సూచించారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *