Goush alam: బాధితుల‌కు ఫోన్లు అంద‌జేసిన‌ ఎస్పీ గౌష్ ఆలం

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
బాధితుల‌కు ఫోన్లు అంద‌జేసిన‌ ఎస్పీ గౌష్ ఆలం
* మొబైల్ ఫోన్ పోయిన వెంటనే పోలీస్ స్టేషన్ ను సంప్రదించండి
* సంతోషం వ్యక్తం చేసిన మొబైల్ ఫోన్ అందుకున్న బాధితులు

మొబైల్ ఫోన్ వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో కానీ సీఈఐఆర్ వెబ్ పోర్టల్ లో కానీ ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపీఎస్ తెలిపారు. శుక్ర‌వారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీసు ముఖ్య కార్యాలయం లో గత మూడు నెలల్లో జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లో పరిధిలో మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న పదిమంది బాధితుల మొబైల్ ఫోన్లను కనిపెట్టి తిరిగి జిల్లా ఎస్పీ చేతుల మీదుగా అంద‌జేశారు. మొబైల్ ఫోన్లు అందుకున్న బాధితులు పోలీస్ స్టేషన్ ల వారీగా పి సాయికిరణ్ ( తిప్ప గ్రామం), ఏ మాధవి (టీచర్స్ కాలనీ), ఏం నరసయ్య (జందా పూర్), వి శైలత (వాడుర్), ఎస్ కే రహీం, (బంగారిగూడ) గణేష్ ల‌కు ఫోన్‌లు బీహార్ నుండి రికవరీ అయ్యాయి. బేల మండల పోలీస్ స్టేషన్ నుండి ఓంకార్ ( బేల), బి గణేష్ (బేల) బోథ్ పోలీస్ స్టేషన్ నుండి విజయ్, బాబేర, రవి ప్రహ్లాద్, నాందేడ్. మొత్తం 10 మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు తెలిపారు. మొబైల్ ఫోన్లను బాధితులకు  శుక్ర‌వారం అప్పగించడం జరిగింది. అందుకున్న బాధితులు జిల్లా ఎస్పీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మొబైల్ ఫోన్లను జాగ్రత్తగా ఉంచుకోవాలని నేరస్తులు దొంగలించిన మొబైల్ ఫోన్లను దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉంటూ వెంటనే సి ఈ ఐ ఆర్ పోర్టల్ లో ఫిర్యాదు నమోదు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పి డిసిఆర్బి కే సురేందర్ రెడ్డి, సిఐలు కే ఫణిదర్, శ్రీనివాస్, సైబర్ సెల్ సిబ్బంది సంజీవ్ కుమార్, రియాజ్, స్టేషన్ సిబ్బంది శరత్, రాంప్రసాద్, ఇస్మాయిల్, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారిని జైస్వాల్ కవిత, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *