సిరాన్యూస్, ఆదిలాబాద్
పోలీసు వ్యవస్థకు అందించిన సేవలు మరువలేనివి: ఎస్పీ గౌష్ ఆలం
పదవీ విరమణ పొందిన హెడ్ కానిస్టేబుల్ ఆడే ఉత్తమ్
* కుటుంబ సభ్యులతో శేష జీవితాన్ని ఆనందంగా గడపాలి
పోలీసు వ్యవస్థకు అందించిన సేవలు మరువలేనివని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌష్ ఆలం అన్నారు. పోలీస్ శాఖ సుదీర్ఘకాలం పాటు సేవలందించి పదవీ విరమణ పొందుతున్న హెడ్ కానిస్టేబుల్ ఆడే ఉత్తమ్ పదవీ విరమణ కార్యక్రమం స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయంలో జిల్లా ఎస్పీ గౌష్ ఆలం సమక్షంలో నిర్వహించారు. ఈసందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో ఆనందంగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జీవించాలని తెలియజేశారు. సిబ్బంది పోలీసు వ్యవస్థకు నిర్విరామంగా అందించిన సేవలు చిరస్మరణీయంగా ఉంటాయని తెలిపారు. 1990 సంవత్సరంలో పోలీసు వ్యవస్థలోకి కానిస్టేబుల్ గా అడుగుపెట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నందు 19 పోలీస్ స్టేషన్లో విధులను నిర్వర్తించి, నాలుగు సంవత్సరాల పాటు ఉట్నూర్ నందు షీ టీం లో మహిళలకు రక్షణగా విధులను నిర్వర్తించడం జరిగిందన్నారు. పదవి విరమణ సందర్భంగా ఆడే ఉత్తమ్ కు జిల్లా ఎస్పీ కుటుంబ సభ్యుల సమక్షంలో శాలువా పూలమాలతో సత్కరించి బహుమతి ప్రదానం చేసి అభినందనలు తెలియజేశారు. చివరగా కుటుంబ సభ్యులతో మాట్లాడి సన్మాన గ్రహీతను ఇంటి వరకు ప్రత్యేక వాహనంలో సాగనంపడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో సీసీ దుర్గం శ్రీనివాస్, జిల్లా పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారిని జైస్వాల్ కవిత, సభ్యులు గిన్నెల సత్యనారాయణ, చిందం దేవిదాస్ తదితరులు పాల్గొన్నారు.