సిరాన్యూస్, ఆదిలాబాద్
సైబర్ నేరం జరిగితే 1930కు ఫోన్ చేయండి : ఎస్పీ గౌష్ ఆలం
* సైబర్ బాధితులకు అండగా సైబర్ వారియర్స్
* ప్రతి పోలీస్ స్టేషన్ కు ఒక సైబర్ వారియర్ కేటాయింపు
* సైబర్ నేరాలపై అవగాహన
సైబర్ క్రైమ్ బాధితులకు మెరుగైన సేవలు అందించేందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో ఒక్కొక్కరి చొప్పున సైబర్ వారియర్స్ ను కేటాయించినట్లు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ తెలిపారు. గురువారం సైబర్ వారియర్స్ కి ప్రత్యేకంగా ఒక సెల్ ఫోన్ సిమ్ కార్డ్ అందజేశారు. సైబర్ వారియర్స్ కు అండగా ఉండాలని తెలియజేశారు. సైబర్ నేరం జరిగిన వెంటనే 1930 ఫోన్ నెంబర్కు గాని, ఎన్సిఆర్బి పోర్టల్ లో గాని, దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ గాని సంప్రదించాలని సూచించారు. సైబర్ నేరం ద్వారా మోసపోయిన డబ్బును త్వరగా ఇప్పించే విధంగా నూతన పద్ధతిని సైబర్ వారియర్స్ కు తెలియజేయడం జరిగిందని, పూర్తి అవగాహనతో కోర్టు ద్వారా వీలైనంత త్వరగా బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. ఇదివరకే సైబర్ నేరగాళ్ల ద్వారా మోసపోయిన వ్యక్తులు ఎవరన్నా ఉంటే వారి డబ్బు బ్యాంకులో ఫ్రీజ్ అయి ఉన్నట్లయితే సైబర్ వారియర్స్ మీకు ఉపయోగకరంగా వీలైనంత త్వరగా డబ్బులు తిరిగి వచ్చే విధంగా కృషి చేస్తారని తెలియజేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఆపరేషన్ బి సురేందర్రావు, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ పి ప్రసాద్, సైబర్ సెల్ ఇంచార్జ్ సింగజ్ వార్ సంజీవ్ కుమార్, ఎం ఏ రియాజ్, జిల్లా సైబర్ సెల్ వారియర్స్ పాల్గొన్నారు.