Goush alam:జిల్లాలో పూర్తిగా మత్తు పదార్థాల నిర్మూలన:  ఎస్పీ గౌష్ ఆలం

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
జిల్లాలో పూర్తిగా మత్తు పదార్థాల నిర్మూలన ఎస్పీ గౌష్ ఆలం
* యువత మత్తు పదార్థాల బారిన పడకుండా అవగాహన
* మత్తు పదార్థాల నిర్మూలన పోస్టర్ల ఆవిష్కరణ

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మత్తు పదార్థాలను పూర్తిగా నిర్మూలించి దిశగా ప‌ని చేస్తున్నామ‌ని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం అన్నారు. ఈ సందర్భంగా సోమవారం స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయంలో జిల్లా ఎస్పీ ,అధికారుల సమక్షంలో మత్తు పదార్థాలు, కల్తీ కళ్ళు, గంజాయి, నిర్మూలనకు తోడ్పడేలా ఏర్పాటు చేసిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాల బారిన పడకుండా ఉండాలని, జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులను ఏర్పాటు చేసి యువతను చైతన్య పరుస్తూ, మత్తు పదార్థాలను భారిన పడితే జరిగి అనర్ధాలపై వివరిస్తూ షీ టీం ద్వారా కార్యక్రమాలను చేపడుతున్నట్టు తెలియజేశారు. అదేవిధంగా ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ , విద్యా సంస్థలలో టీఎస్ న్యాబ్ ద్వారా విచ్చేసిన పోస్టర్లను ఉంచడం జరుగుతుందని తెలిపారు. ఇటువంటి సమాచారాన్ని అందించాలన్న పోస్టర్లలో పేర్కొన్న నంబర్లకు ఫోన్ చేసి చెప్పగలరని సూచించారు. కల్తీ కళ్ళు ,గంజాయి లాంటి వాటిని సేవించడం వల్ల ప్రాణ హాని తప్పదని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పి ఆపరేషన్ బి సురేందర్ రావు, ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, డిసిఆర్బి డిఎస్పి సురేందర్, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి పోతారం శ్రీనివాస్, సిఐలు కే సత్యనారాయణ, ఏ అశోక్, డి సాయినాథ్, కె పనిధర్, శ్రీనివాస్, డిసిఆర్బి సీఐ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *