ఉత్తమ పురస్కారానికి ఎంపికైన ప్రభుత్వ ఉద్యోగి,

అవార్డు అందుకోవాల్సింది పోయి..కటకటాల పాలైన వైనం
 సిరా న్యూస్,శ్రీసత్యసాయి;
రిపబ్లిక్ సందర్భంగా అయన ఉత్తమ పురస్కారానికి ఎంపియ్యాడు. కానీ మద్యం తెస్తూ పోలీసులకు దొరికిపోయాడు. కర్ణాటక రాష్ట్రం బాగేపల్లి నుంచి మద్యాన్ని తీసుకొస్తున్న చిరమత్తూరు మేజర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎస్ఈబీ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. శ్రీ సత్య సాయి జిల్లా చిలమత్తూరు మండలం కొడికొండ చెక్పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా చిలమత్తూరు మేజర్ పంచాయతీ కార్యదర్శి మధుసూదన్ కర్ణాటక రాష్ట్రం బాగేపల్లి నుంచి మారుతి వ్యాన్ లో ఆరు బీరు బాటిళ్లు తోపాటు ఒక ఫుల్ బాటిల్ మద్యాన్ని తీసుకొస్తుండగా కొడికొండ చెక్పోస్ట్ వద్ద సెబ్ ఎస్సై ఇంతియాజ్ అదుపులోకి తీసుకున్నారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఉత్తమ పురస్కారానికి మధుసూదన్ ఎంపికయ్యారు. పురస్కార జాబితాలో ఆయన నంబరు 332. గణతంత్ర దినోత్సవ సందర్భంగా శుక్రవారం మద్యం దుకాణాలను మూసివేస్తారు. తనకు అవార్డు వచ్చినందుకు సెలెబ్రేట్ చేసేందుకు ముందుగానే మద్యం తెచ్చారా.. లేదా ఈ దందా ప్రతిరోజూ నడిపిస్తున్నారా అన్న చర్చ జరుగుతోంది. పంచాయతీ కార్యదర్శిని తప్పించేందుకు ఎస్ఈబీ పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే అప్పటికే సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అతనిపై కేసు నమోదు చేస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *