కార్మికుల శ్రమను గుర్తించని ప్రభుత్వాలు కూలడం ఖాయం

పదవ రోజు సమ్మెలో కళ్ళకు గంతలతో నిరసన
మున్సిపల్ కార్మికుల సమ్మెకు టీడీపీ సంపూర్ణ మద్దతు
టిడిపి మాజీ ఎమ్మెల్యే కె. విజయమ్మ
సిరా న్యూస్,బద్వేలు;
మున్సిపల్ కార్మికులకు జగనన్న ఇచ్చిన హామీలు అమలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మె 10రోజులో భాగంగా స్థానిక పురపాలక సంఘ కార్యాలయం వద్ద బద్వేల్ మున్సిపల్ వర్కర్స్ @ ఎంప్లాయిస్ యూనియన్( సిఐటియు) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ నల్ల రిబ్బన్లతో కళ్ళకు గంతలు కట్టుకొని తమ నిరసన తెలియజేశారు.
మున్సిపల్ కార్మికుల సమ్మెకు తెలుగుదేశం పార్టీ బద్వేల్ నియోజకవర్గం మాజీ శాసన సభ్యురాలు కె.విజయమ్మ, పార్టీ నాయకులు మహబూబ్ బాషా, కె.వి సుబ్బారెడ్డి, శంకర్ రెడ్డి, యానాది రెడ్డి, ఎస్ ఎం భాష,వెంకటయ్య తదితరులు పాల్గొని తమ పార్టీ తరపున సంపూర్ణ మద్దతు తెలియజేశారు.
ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ బద్వేల్ నియోజకవర్గం మాజీ శాసన సభ్యురాలు కె.విజయమ్మ గారు మాట్లాడుతూ….
రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలను అమలు చేయాలని గడచిన 10 రోజులుగా మున్సిపల్ కార్మికులు రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మె నిర్వహిస్తుంటే ప్రభుత్వం సమ్మె విరమణకు అవసరమైన చర్యలు చేపట్టి కార్మికుల సమస్యలు పరిష్కరించాల్సింది పోయి కార్మికుల సమ్మెను విచ్చిన్నం చేయుటకు గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులు, మెప్మా ఆర్పీలు, బయట కూలీలతో పారిశుద్ధ్య పనులు చేయించాలనుకోవడం దుర్మార్గమని అధికారంలోకి రాకమునుపు మాట తప్పను మడమ తిప్పను అనే నినాదంతో హామీలు ఇచ్చి నేడు మాట తప్పి మడమ తిప్పడం సిగ్గుచేటని, కార్మికులు చేస్తున్న సమ్మెను విచ్చిన్నం చేయుటకు చేపట్టిన చర్యలను మానుకోవాలని, కార్మికుల శ్రమను గుర్తించని ప్రభుత్వాలు చరిత్రలో మనుగడ సాగించలేదని ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలైన పర్మినెంట్, సమాన పనికి- సమాన వేతనం, ఇంజనీరింగ్ కార్మికులకు నైపుణ్యం గల వేతనాలు, పర్మినెంట్ సిబ్బందికి సిపిఎస్ రద్దు, కోవిడ్ అదనపు కార్మికులకు ఉద్యోగ భద్రత, పట్టణాల విస్తీర్ణం మేరకు సిబ్బంది పెంపు తదితర సమస్యలు పరిష్కరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాసులు, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ముడియం చిన్ని, నాయకులు జీవి రమణారెడ్డి, ఆదిల్ యూనియన్ పట్టణ అధ్యక్షులు పులి శ్యాం ప్రవీణ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు దియ్యాల హరి, ఉపాధ్యక్షులు దియ్యాల దేవమ్మ, గంటా శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి దియ్యాల నాగేంద్రబాబు, కార్యదర్శులు నాగరపు సత్యరాజు, బద్వేల్ ప్రవీణ్ కుమార్, నేలటూరు పాలయ్య, కోశాధికారి కాలువ శివకుమార్ కమిటీ సభ్యులు పద్మిశెట్టి రామయ్య, ఇండ్ల చంద్రశేఖర్, తేళ్ల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *