సిరా న్యూస్,సికింద్రాబాద్;
మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సోమవారం పరామర్శించారు. ఇటీవల మరణించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు శంకర్ యాదవ్ నివాసానికి గవర్నర్ దత్తాత్రేయ వెళ్లారు. శంకర్ యాదవ్ చిత్రపటం వద్ద పూలు సమర్పించి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలిపారు.
===