సిరాన్యూస్, ఖానాపూర్
సోనియా గాంధీని విమర్శించే అర్హత కిషన్ రెడ్డికి లేదు: బాణావత్ గోవింద్ నాయక్
సోనియా గాంధీని విమర్శించే అర్హత కిషన్ రెడ్డికి లేదని కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు బాణావత్ గోవింద్ నాయక్ అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.తెలంగాణ రాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన సోనియామ్మ ను విమర్శించే అర్హత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కి లేదని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఆనాటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ దన్నారు. కిషన్ రెడ్డి సోనియా గాంధీ గురించి మాట్లాడడం సరైదని కాదన్నారు.