సిరా న్యూస్, ఖానాపూర్
16 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం హర్షించదగ్గ పరిణామం
* కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ నిర్మల్ జిల్లా చేర్మెన్ బాణావత్ గోవింద్ నాయక్
కొత్తగా 16 కార్పొరేషన్లు తెలంగాణ ప్రజలకు అందించడం హర్షించదగ్గ పరిణామమని కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ నిర్మల్ జిల్లా చేర్మెన్ బాణావత్ గోవింద్ నాయక్ అన్నారు. గురువారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో గోవింద్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణలో కులావృత్తులు ఆర్థికంగా అండగా నిలువలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం గొప్ప పరిణామమని, ఇప్పటివరకు కార్పొరేషన్ లేని సామజిక వర్గాలకు కార్పొరేషన్ ఏర్పాటుచేయడం తెలంగాణ ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి కి ప్రతేక ధన్యవాదాలు తెలిపారు. సమాజంలో అణగారిన వర్గాలు సబ్బందావర్గలాను ప్రత్యేక కార్పొరేషన్ లు వీరి జీవన విధానంలో మార్పులు తీసుకోరావాలని నిర్ణయించటం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ముదిరాజ్,యాదవ్, మున్నూరు కాపు, పద్మశాలి పెరికే ,లింగ యత మేర, గంగ పుత్ర ,ఓబీసీ ఆర్యావ్యాస కార్పొరేషన్, రెడ్డి కార్పొరేషన్, మాదిగ ఉపకులాల కార్పొరేషన్, ఆదివాసీ కార్పొరేషన్, సంత్ సేవాలాల్, లంబాడా కార్పొరేషన్ ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడం గొప్ప నిర్ణయమని చెప్పారు.ప్రజా పాలన పేదల ప్రభుత్వం ఆరు గ్యారింటిలతో అద్భుతంగా ప్రజల వద్దకు వెళుతుందన్నారు.2008 డిఎస్సి అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు మహిళ సంఘాలను బలోపేతం చేసే విదంగా రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయము తీసుకోవడం గొప్ప విషయమని అన్నారు.