సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
కాంగ్రెస్ తోనే ఇందిరమ్మ రాజ్యం సాధ్యం
* కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్
కాంగ్రెస్ తోనే ఇందిరమ్మ రాజ్యం సాధ్యమవుతుందని నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదవాడి ఇంటి నిర్మాణానికి ఇసుక ఆర్థిక భారాన్ని తగ్గిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ కు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఇది ప్రజలకు మేలు జరిగే విషయం అన్నారు. పేదవాడి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి అడుగులు వేసే సమయం అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.