సిరాన్యూస్,ఖానాపూర్ టౌన్
జర్నలిస్తులపై దాడి చేయడం దారుణం : బాణావత్ గోవింద్ నాయక్
జర్నలిస్తులపై దాడి చేయడం దారుణమని నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మీడియా ప్రతినిధులపై దాడిని ఆయన ఖండించారు.ఉప్పల్ ప్రెస్ క్లబ్ లో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ బాధితులు తిప్పారావు సంపత్ తన గోడు వెళ్ళబోసుకునేందుకు పత్రిక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమయం లో ఈటెల రాజేందర్ అనుచరులు పెద్ద ఎత్తున ప్రెస్ క్లబ్ లోకి చొరబడి సంపత్ పై దాడి చేయడంతో పాటు మీడియా సమావేశాన్ని కవర్ చేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల పైన దాడి చేయడం బాధాకరమన్నారు. ప్రభుత్వనికి ప్రజలకు మధ్య వారదిగా ఉండి ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే జర్నలిస్తులపై దాడి చేయడం దారుణం అన్నారు .ఇలాంటి సంఘటన భవిష్యత్తు లో పునరవృతం కాకుండా బాధితుల పై కేసులు పెట్టి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.