Govt Colleges: పిల్లలను ప్రభుత్వ కళాశాలల్లోనే చేర్పించాలి

ఉట్నూర్, సిరా న్యూస్ 

ప్రభుత్వ కళాశాలలోనే పిల్లలను చేర్పించాలి

ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

ప్రైవేటు కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలో అన్ని సౌకర్యాలతో కూడిన విద్య బోధనను అందించడం జరుగుతుందని, విద్యార్థులు  ప్రభుత్వ కళాశాలలోనే చేరాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శనివారం ఉట్నూరు మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులతో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ కళాశాలలోనే చేర్పించాలన్నారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యను బోధించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులకు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారన్నారు. బాలురు, బాలికలకు వేరువేరుగా హాస్టల్ సదుపాయం కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ఏడాది నుంచి ఎన్ సీసీ కోర్సులు కూడా ఉంటాయని తెలిపారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల కాగానే డిగ్రీ కళాశాలలకు అడ్మిషన్లు ప్రారంభమవుతాయని ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ యం.స్వామి,ఆధ్యాపకులు డాక్టర్ సంగీత ,శ్రావణి, శ్రీధర దేవి, రవీందర్, రాజ్ కుమార్, శ్రీనివాస్, ప్రవీణ్, జావిద్, చరణ్, హంసరాజ్ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *