ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి….

సిరా న్యూస్;

బ్యాంకులకు పంట రుణాలు చెల్లిస్తామని ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలి
పంటలు ఎండుతున్నా ప్రభుత్వానికి కనికరం లేదు

మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కాఫర్ డ్యాం నిర్మాణం చేస్తే ఈ దుస్థితి వచ్చేది కాదు

కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్

రైతులను బ్యాంకర్లు అడగకుండా ప్రభుత్వం వారికి గ్యారెంటీ జీవో విడుదల చేయాలి

జ్జంకీ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తో కలిసి ఎండిన పంటల పరిశీలన

2లక్షల రుణమాఫీ హామీ ఏమైంది

ఎకరాకు₹25వేల నష్ట పరిహారం ఇవ్వాలి

🟢ప్రజలు మార్పు కోరుకున్నది మంచి చేస్తారని..ఇలా కన్నీరు పెట్టిస్తారని కాదు

రైతులు ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలు సాగు నీళ్లు లేక ఎండిపోతుంటే రైతులు కన్నీరు పెడుతున్నారని… కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇతర పార్టీల నాయకులను పార్టీలో చేర్చుకునే సమయం ఉంటుంది కానీ…ఎండిన పంటలను పరిశీలించి,రైతులకు ధైర్యం చెప్పే సమయం కూడా లేదా అని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.

మానకొండూర్ నియోజకవర్గం లోని బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో ఎండిన పంట పొలాలను మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గారితో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన పిల్లర్ల వద్ద కాంగ్రెస్ ప్రభుత్వం కాఫర్ డ్యాం నిర్మాణం చేసినట్లయితే ఇప్పుడు కరువు వచ్చే పరిస్థితి ఉండేది కాదని…గోదావరి నదిలో ప్రభుత్వ అసమర్థత కారణంగా రోజుకు 5000ల క్యూసెక్కుల నీళ్లు వృధాగా పోతున్నామని పేర్కొన్నారు.

గత పదేళ్ల కాలంలో తెలంగాణ తొలిముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎర్రటి ఎండల్లో కూడా కాల్వల ద్వారా చెరువులకు నీళ్లు విడుదల చేయించడంలో పంటలు ఎండలేదని….కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే పంటలు ఎండిపోయాయని పేర్కొన్నారు.అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 నాడు ₹2లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయడంతో రైతులు పంట రుణాలు తీసుకున్నారని, ఇప్పుడు బ్యాంకు అధికారులు ప్రభుత్వంతో సంబంధం లేదు..తీసుకున్న రుణాలు కట్టాలని రైతుల ఇంటికి వెళ్తున్నారని అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ₹2లక్షల రుణమాఫీ చేయాలని..బ్యాంకు అధికారులు రైతుల వద్దకు వెళ్లకుండా ప్రభుత్వం బ్యాంకులకు రుణాలు చెల్లిస్తామని గ్యారంటీ ఇవ్వాలని…దీనికి సబంధించిన జీవోలను విడుదల చేయాలన్నారు.తెలంగాణ రాష్ట్రం రాక ముందు రైతుల ఇళ్ల వద్దకు బ్యాంకు అధికారులు వచ్చే వారని….మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ పాలన చూస్తుంటే పాత రోజులు గుర్తుకు వస్తున్నాయని అన్నారు.ప్రజలు మార్పు కోరుకున్నది మంచి చేస్తారని అనుకున్నారని…కానీ ఇలా మోసాగిస్తారని ప్రజలు అనుకోలేదని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎండిన పంటలకు ఎకరాకు ₹25వేల చొప్పున పంట నష్ట పరిహారం ఇవ్వాలని…రైతులను ప్రభుత్వం ఆగం చేయొద్దని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ₹2లక్షల రుణమాఫీ, రైతులకు క్వింటాలుకు ₹500ల బోనస్ వంటి హామీలను అమలు చేసేంత వరకు రైతుల పక్షాన పోరాటం చేస్తామని…రైతులు అధైర్యపడొద్దని అండగా ఉంటామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు లింగాల లక్ష్మణ్, శ్రీనివాస్ గుప్త, బోయినపల్లి శ్రీనివాస్ రావు, తిరుపతి రెడ్డి, రాజిరెడ్డి, తిరుపతి రెడ్డి, కచ్చు రాజయ్య, మోహన్, సుదర్శన్, తిరుపతి, సాయి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
===========================xxx

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *