గౌడ కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటాం

ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

 సిరా న్యూస్,జగిత్యాల;

ఇటీవల అగ్ని ప్రమాదంలో ఈత చెట్లు కాలిపోయి గౌడ కులస్తుల జీవనోపాధి కోల్పోయిన కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని, రాష్ట్ర ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
బుగ్గారం మండలం సిరికొండ గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 1200 కి పైగా ఈత చెట్లు దగ్ధంకాగా విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురువారం దగ్ధమైన ఈత వనాన్ని మండల నాయకులతో కలిసి పరిశీలించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ షేక్ యాష్మీన్ భాషా, ఎక్సైజు సూపరింటెండెంట్ సత్తయ్యతో నష్టపరిహారంగురించి మాట్లాడారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ
ఇటీవల ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో సిరికొండ గ్రామంలో సుమారు 1200 పైగా ఈత చెట్లు కాలిపోవడం చాలా బాధాకరమని,దీనిపై ఆధారపడ్డ కుటుంబాలు జీవనోపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు.
నష్టపోయిన గౌడ కులస్తులను ప్రభుత్వం తరపున ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
,ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి నష్ట పరిహారం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని,గ్రామానికి సంబందించిన పలు సమస్యలను విప్ దృష్టికి తీసుకురాగా ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం పరిష్కరిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్అధ్యక్షులు వేముల సుభాష్, జెడ్పిటిసి రాజేందర్, మాజీ సర్పంచులు తిరుపతి, అశోక్ రావు, ఎన్నం కిషన్ రెడ్డి,పార్టీ నాయకులు సిగిరి అంజిత్, మహేష్, సత్తయ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *