ఆప్యాయతగా పలకరిస్తూ మరోసారి ఆశీర్వదించాలని…

వైసిపి అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి

సిరా న్యూస్,నంద్యాల;
నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 33 వ వార్డు జ్ఞానాపురంలో వార్డు కౌన్సిలర్ ఎద్దు మనోరంజని వార్డ్ ఇంచార్జ్ ఎద్దు రవికుమార్ ఆధ్వర్యంలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు చిక్కటి చిరునవ్వుతో ఆప్యాయతతో ప్రతి ఒక్కరిని పలకరిస్తూ వచ్చే ఎన్నికలలో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా రవిచంద్ర కిషోర్ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా పోచా బ్రహ్మానందరెడ్డిని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్ర ప్రజలకు ఏం చేశావని ఒక్కసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చేసిన వాటిలో పది శాతం కూడా చేయలేకపోయావని అన్నారు తెలుగుదేశం నాయకులు ఎన్నికల సమయంలో తప్పుడు వాగ్దానాలు చేసి ఓట్లు వేయించుకున్న తర్వాత వారిచ్చిన మేనిఫెస్టోను పక్కన పడేయడం తప్ప ప్రజలకు ఒక మంచి చేసిన పాపను పోలేదన్నారు నంద్యాలలో టిడిపి అభ్యర్థి 17 సంవత్సరాలు పదవులు పొంది చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక పని కూడా చేయలేకపోయాడు వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నంద్యాలలో సంక్షేమం అభివృద్ధి ఎంత గొప్పగా జరిగిందో ప్రజలందరికీ తెలుసు అన్నారు మొట్టమొదటిగా నంద్యాలలో జిల్లాగా ప్రకటించిన గొప్ప నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు ఎన్నికలలో వైఎస్ఆర్ ప్రభుత్వం మరోసారి ఆశీర్వదించాలని ప్రజలందరిని వైసిపి అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి ప్రజలను కోరారు

ఈ కార్యక్రమంలో రాష్ట్ర దృశ్యకతల డైరెక్టర్ సునీత అమృతరాజ్, ఏపీ ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ శశికళా రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ లు గంగిశెట్టి శ్రీధర్ ,పామ్ షావలి, సచివాలయాల కన్వీనర్ దాల్మిల్ అమీర్, మరియు వార్డు వైసిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *