gruha jyothi: తెరపైకి మళ్లీ ప్రజా పాలన దరఖాస్తులు

సిరా న్యూస్,భీమదేవరపల్లి
తెరపైకి మళ్లీ ప్రజా పాలన దరఖాస్తులు
* కరెంట్ బిల్లు మాఫీ కాకపోవడంతో దరఖాస్తు దారుల్లో ఆందోళ‌న‌
* మోర ఇస్తున్న ప్రజాపాలన సైట్లు….
* పరపతి ఉంటేనే ఫారం ముందుకు
గత కొద్దీ రోజుల నుండి ప్రతి ఇంటికి కరెంటు బిల్లుల చిట్టీలు చేరడంతో గృహ జ్యోతి పథకం లబ్ది పొందని వినియోగదారులు ఆందోళన చెందుతూ స్పష్టత కోసం మండల ఆఫీసులకు తిరుగుతున్నారు. భీమదేవరపల్లి మండలంలోని లబ్ది పొందని వినియోగదారులు ఎంపీడీఓ ఆఫీస్ ముందు చేరడంతో రద్దీ పెరిగిపోయింది. దీనితో కంప్యూటర్లో నమోదు కానీ వివరాల కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెపుతున్నారు. లబ్ది పొందని వారు తిరిగి దరఖాస్తు చేసుకోవడం కోసం ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ప్రజాపాలన రషీదు, గ్యాస్ కనెక్షన్ వివరాలు తీసుకొని రావాలని సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *