సిరా న్యూస్, బోథ్
ఎవరేజ్ పేరిట విద్యుత్ శాఖ బిల్లింగ్ లో అక్రమాలు
* గృహ జ్యోతి పథకానికి అర్హులం తగ్గిస్తున్న కాంట్రాక్టర్
రాష్ట్ర ప్రభుత్వం 200 యూనిట్ల వరకు గృహ జ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్తు అందిస్తోంది. అయితే విద్యుత్ శాఖ తరఫున బిల్లులు ఇంటింటికి తిరిగి కొట్టే కాంట్రాక్టర్ మూడు రోజుల ముందుగానే బిల్లులను కొడుతున్నాడు. అయితే మూడు రోజుల విద్యుత్ వాడకాన్ని అంచనా వేసి ఎవరేజ్ బిల్లులు కొట్టడం జరుగుతుంది. అయితే వినియోగదారుని మూడు రోజుల విద్యుత్ వాడకాన్ని అంచనా వేయడంలో కాంట్రాక్టర్కు ఏ విధమైన అధికారం ఉందని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. విద్యుత్ వాడకుండా ముందుగానే నెలలో వాడిన విద్యుత్ బిల్లులలో అదనంగా మూడు రోజుల బిల్లులను ఊహాజనితంగా నిర్ధారించి కలుపుకొని బిల్లులను పంపిస్తున్నారు. దీంతో గృహజ్యోతి పథకానికి ఎంతోమంది దూరం కావడం జరుగుతుందని విద్యుత్ వినియోగదారులు వాపోతున్నారు. తేజపూర్ గ్రామానికి చెందిన గడ్డం రాజమణి అనే వినియోగదారులకు 27 రోజుల బిల్లు 182 యూనిట్లు వాడగా, మిగతా మూడు రోజుల బిల్లులను వినియోగదారులు వాడకుండానే ఎవరే బిల్లు పేరుతో 26 యూనిట్లు వాడినట్లుగా నిర్ధారించుకొని 26 యూనిట్ల బిల్లును కలిపి పంపించడం జరిగిందని వాపోయారు. ఈ విధమైన బిల్లులు జిల్లా వ్యాప్తంగా కొట్టి పంపితే వందలాదిమంది ఉచిత విద్యుత్తుకు దూరం కావడంతో పాటు విద్యుత్ శాఖకు లక్షల్లో అక్రమంగా విద్యుత్తును వినియోగించకుండా చెల్లించాల్సి వస్తుందని వాపోతున్నారు. ఈ విధమైన బిల్డింగులు చేయించడంలో ఎవరి హస్తం ఉందనేది జిల్లా అధికారులు పరిశీలించాల్సిన అవసరం ఉంది.