సిరా న్యూస్, పెంబి
గృహజ్యోతి పథకం ప్రారంభం
రాష్ర్ట ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గృహ జ్యోతి పథకం 200 యూనిట్ల లోపు కరెంట్ వాడే వినియోగదారులకు జీరీ బిల్లు ల జారీ ప్రారంభమైంది. నిర్మల్ జిల్లా పెంబి మండలం లో శనివారం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు స్వప్నిల్ గృహ జ్యోతి పథకం కింద జీరో కరెంట్ బిల్ జారీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల హామీల ప్రకారం గృహ జ్యోతి పథకం అమల్లోకి రావడం మంచి విశేషం అని అన్నారు. ఇకనుండి కరెంట్ బిల్లు కోసం అవస్థలు పడే అవసరం లేదని తెలిపారు. 500 కే సిలిండర్ త్వరలో అందుబాటులోకి రాబోతుందని అన్నారు. కార్యక్రమంలో తులాల శంకర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.