శ్రీవారిని దర్శించుకున్న గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని

సిరా న్యూస్,తిరుమల;
గుడివాడ శాసనసభ్యులు కొడాలి వెంకటేశ్వరరావు (నాని) కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం సుప్రభాత సేవ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాని,ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి వారి దర్శన కార్యక్రమాల అనంతరం బయటకు వచ్చిన ఎమ్మెల్యే కొడాలి నానితో సెల్ఫీలు దిగేందుకు భక్తులు పోటీపడ్డారు. దర్శనఅనంతరం ఎమ్మెల్యే కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.శ్రీవారి దీవెనలు సీఎం జగన్ఆయన కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని, స్వామివారి కృపతో మంచి కోసం పనిచేసే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం గత ఎన్నికలకు మించి, ఫలితాలు సాధిస్తుందని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *