Gun attack on couple : దంపతులపై తుపాకీ తో దాడి

 సిరా న్యూస్,అన్నమయ్య;
దంపతులపై తుపాకీతో దాడి చేసిన సంఘటన బుధవారం రాత్రి కురబలకోట మండలంలో జరిగింది.ఘటనకు సంబంధించి బాధితుల కుటుంబ సభ్యులు ముదివేడు పోలీసులు తెలిపిన వివరాలు.
.. అన్నమయ్య జిల్లా,తంబళ్లపల్లి నియోజకవర్గం లోని కురబలకోట మండలం,ముదివేడు గ్రామం,దిన్నె మీదపల్లెకు చెందిన దంపతులు సరస్వతమ్మ(50),జి.రెడ్డిశేఖర్ రెడ్డి(55)లను పొరుగు గ్రామం బద్ది పల్లికి చెందిన మల్ రెడ్డి అలియాస్ మల్లి పొలంలో జొన్న పంట సాగు చేసిన విషయమై జరిగిన గొడవలో నాటు తుపాకితో దంపతులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.కుటుంబ సభ్యులు గమనించి బాధితులను మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సలు చేయించారు.ఘటనపై ముదివేటి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *