సిరాన్యూస్, ఓదెల
యాదవ కార్పొరేషన్ ఏర్పాటు హర్షణీయం
కార్పొరేషన్ తో యాదవుల సమస్యలు పరిష్కారం
యాదవ సంఘం రాష్ట్ర నాయకులు గుండేటి ఐలయ్య యాదవ్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాదవ ,కురుమ సమస్యలు పరిష్కారం కోసం యాదవ ,కురుమ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం హర్షణీయం అని యాదవ సంఘం రాష్ట్ర నాయకులు గుండేటి ఐలయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాలుగా యాదవ కార్పొరేషన్ ఏర్పాటు కోసం యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యలో ప్రభుత్వానికి విన్నవించడం జరిగిందన్నారు. గత పాలకులు పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం యాదవ కార్పొరేషన్ ఏర్పాటుకు ముందుకు వచ్చిందని పేర్కోన్నారు. యాదవ కార్పోరేషన్ కోసం కృ షీ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తలిపారు. యాదవ కార్పొరేషన్ ఏర్పాటు కు కృషి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి , మంత్రి ప్రభాకర్కి , మంత్రి శ్రీధర్ బాబుకి పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరామనరావుకి యాదవ కులస్థుల తరుపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అని అన్నారు.యాదవ కులస్థులకు రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో మరింతగా ప్రాధాన్యత కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు జీలుక సంతోష్ యాదవ్ , గుండేటి సారయ్య , అసరీ ఎర్రయ , అముల్ల శంకర్ , గుండేటి మల్లయ్య , ఈద రాజయ్య యాదవ్ , బీనవేన చేరలు , బావు కత్యలు , గుండేటి కొమురయ్య , ఈద మహేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.