సిరాన్యూస్, గన్నేరువరం
గన్నేరువరం జడ్పీహెచ్ఎస్లో వ్యాసరచన పోటీలు
* ఘనంగా జాతీయ జెండా ఆమోదించిన దినోత్సవం వేడుకలు
గన్నేరువరం మండల కేంద్రంలోని జడ్పీ హెచ్ ఎస్లో పాఠశాలలో సోమవారం జాతీయ జెండా ఆమోదించిన దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు.భారత జాతీయ జెండాను ఆమోదించి నేటికి 77 ఏళ్ళు అవుతుందని ,1947 జూలై 22న నిర్వహించిన రాజ్యాంగ సభలో కాషాయం తెలుపు ఆకుపచ్చ రంగులు మధ్యలో అశోక చక్రంతో రూపొందించిన జెండాను భారతీయ జాతీయ జెండాగా ఆమోదించారని ,జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య తెలుగువారు కావడం మన గర్వకారణమని ఉపాధ్యాయులు అన్నారు. అనంతరం జాతీయ జెండాకు వందనం చేశారు. స్మార్ట్ ఇండియా నిర్మాణం లో యువత పాత్ర అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు.బహుమతులు ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు, టాటా బిల్డింగ్ ప్రతినిది, లైన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.