సిరా న్యూస్, గుంటూర్:
గుంటూర్ జనరల్ ఆసుపత్రికి రోగమొచ్చింది…
+ కానరానీ పారిశుద్ధ్య నిర్వహణ
+ టాయిలెట్లలో కరువైన నీళ్లు
+ అవస్థలు పడుతున్న రోగులు
గుంటూర్ జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ లోపించింది. టాయిలెట్లలో కనీసం నీళ్లు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతినిత్యం వందలాది రోగులతో కిటకిటలాడే జనరల్ ఆసుపత్రి నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని స్థానికులు వాపోతున్నారు. రోగాలు నయమవుతాయని ఆసుపత్రికి వెళ్తే, ఉన్న రోగాల సంగతి దేవుడెరుగు గానీ కొత్త రోగాలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉన్న, ఈ కాలంలోనే ఆసుపత్రిని పట్టించుకోవడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కనీసం ఆసుపత్రిలో ఒంటికి, రెంటికీ కూడా నీళ్ళు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆస్పత్రిలో దుర్గంధం భరించలేక నానా అవస్థలు పడుతున్నారు. అధికారులు ఇకనైనా పట్టించుకొని పారిశుద్ధ్య నిర్వహణను అత్యంత పకడ్బందీగా చేపట్టాలని కోరుతున్నారు.