పుష్ప తరహాలో స్మగ్లింగ్ చేస్తున్న ముఠా గుట్టు రట్టు

సిరా న్యూస్,జగ్గంపేట;
పుష్ప సినిమా తరహాలో స్మగ్లింగ్ చేస్తున్నముఠాను కిర్లంపూడి పోలీసులు పట్టుకున్నారు. : ఆయిల్ ట్యాంకర్ లారీలో ప్రత్యేకంగా తయరు చేసిన అరలో గంజాయిని తరలిస్తుండగా కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ గేట్ పోలిసులు పట్టుకున్నారు. కిర్లంపూడి పోలీసు స్టేషన్ లో ఆ వివరాలను పెద్దాపురం డిఎస్పీ కె. లతాకుమారి వెల్లడించారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుండి చెన్నై వైపుకు వెళుతున్న లారీ ట్యాంకర్ క్యాబిన్ లో ప్రత్యేకంగా తయారుచేసిన అరలో గంజాయిని తరలిస్తున్నారన్నారు. లారీలో ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని 84 కేజీల గంజాయిని స్వాధీనం, చేసుకునామన్నారు అలాగే లారీని సీజ్ చేయడం జరిగిందన్నారు. సిబ్బందిని అమె అభినందించారు. ఈ సమావేశంలో సీఐ లక్ష్మణరావు, ఎస్ఐ జి సతీష్ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *