Handicraft program : అనకాపల్లి లో చేయూత కార్యక్రమం

 సిరా న్యూస్,అనకాపల్లి;
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో భాగమైన చేయూత లబ్ధిదారులకు నాలుగో విడత లబ్ధిని అందించే కార్య క్రమాన్ని అనకాపల్లి జిల్లాలో వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వ హిస్తున్నాయి. ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ సభ ఎన్నికల శంఖా రావానికి నాంది పలుకుతుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమ ర్నాథ్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో వైసీపీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో ఈ సభను విజయవంతం చేయడానికి సిద్ధమవు తున్నారు. ఈ సభలో జగన్మో హన్ రెడ్డి కీలక ప్రసంగం చేయనున్నా రని పార్టీ నాయకులు విశ్లేషిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మా ట్లాడుతూ వైయస్సార్ చేయూత నాలు గో విడత కార్యక్రమంలో భాగంగా పిసినికాడలో ఏర్పాటు చేసిన సభ నుంచి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 25 లక్షల మందికి చేయూత లబ్ధిని అందించనున్నారని చెప్పారు. ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు ఐదు సంవత్సరాలలో సుమారు 70 వేల రూపాయల లబ్ధిని అందజేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కు తుందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *