హనుమాన్ జయంతి బైక్ ర్యాలీ

సిరా న్యూస్,హైదరాబాద్;
హైదరాబాద్ పాతబస్తీ హనుమాన్ జయంతి సందర్భంగా గౌలిపుర డివిజన్ లోని నరేంద్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్ నుంచి విశ్వహిందూ పరిషత్. మరియు బజరంగ్దళ్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయ బైక్ ర్యాలీ నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సౌత్ జోన్ డిసిపి సాయి చైతన్య హాజరై ప్రత్యేక పూజ నిర్వహించిన అనంతరం జండా ఊపి బైక్ ర్యాలీ ప్రారంభించారు. ఈ శోభాయాత్రలో నలుమూలల నుండి వేలాది మంది భక్తులు యువకులు కాషాయం జెండాలు చేతిలో పట్టుకొని జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ బ్యాండ్ మేళాలు డీజే పాటలతో నృత్యాలతో శోభాయాత్ర కన్నుల పండుగగా సాగింది. ఈ శోభాయాత్ర సందర్భంగా పాతబస్తీలో నీ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరకుండా సౌత్ జోన్ డిసిపి సాయి చైతన్య ఆధ్వర్యంలో అడుగడుగున సీసీ కెమెరాలతో శోభాయాత్ర కదలికలను పరిశీలిస్తూ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ షేక్ జహంగీర్ .ఛత్రినాక ఏసిపి సిహెచ్ చంద్ర శేఖర్ తదితర ఉన్న త అధికారులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
=======================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *