సిరా న్యూస్,తాడేపల్లిగూడెం;
స్వాతంత్ర్య సమరయోధుల స్పూర్తితో ప్రతి ఒక్కరు జాతీయ భావాన్ని పెంపొందించుకోవాలని ఏపీ నిట్ డీన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ డాక్టర్ జిఆర్కే శాస్త్రి సూచించారు. నిట్ ఇంచార్జ్ డైరెక్టర్ డాక్టర్ బిఎస్.మూర్తి ఆధ్వర్యంలో ప్రాంగణంలోని పరిపాలనా భవనం వద్ద 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధి శాస్త్రి మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం తెల్లదొరలను ఎదిరించి ప్రాణత్యాగం చేసిన మహనీయుల స్పూర్తితో యువత నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని సూచించారు. దేశ ప్రగతి రథసారధులు విద్యార్థులేనని, వినూత్నఆలోచనలు చేస్తూ కొత్త కొత్త ప్రాజెక్టులు, పరిశోధనలు చేపట్టాలని చెప్పారు. ఈ విద్యాలయం ఓ అవకాశాల గని అని, అందులోని విజ్ఞానాన్ని తవ్వి తీసుకున్న వారి జీవితం బంగారుమయం అవుతుందని వివరించారు. రిజిస్ట్రార్ డాక్టర్ పి.దినేష్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్య సాధన కోసం ప్రాణాలర్పించిన మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని వివరించారు. ముందుగా శాస్త్రి జాతీయ జెండాను అవిష్కరించి సిబ్బంది నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డీన్ లు డాక్టర్ కురుమయ్య, డాక్టర్ వీరేష్ కుమార్, ఆచార్యులు డాక్టర్ కిరణ్ తీపర్తి, డాక్టర్ వి.సందీప్, డాక్టర్ పి.శంకర్, డాక్టర్ తపస్, డాక్టర్ అరుణ్ కుమార్, డాక్టర్ కృష్ణ మూర్తి, డాక్టర్ తలారి రేష్మా, డాక్టర్ హిమబిందు, డాక్టర్ సౌమ్య తదితరులు పాల్గొన్నారు.