గువ్వల చెరువు టన్నెల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం పై హర్షనీయం: వైఎస్ఆర్ సిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు

 శ్రీకాంత్ రెడ్డి
సిరా న్యూస్,అన్నమయ్య;
గువ్వల చెరువు టన్నెల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం హర్షణీయమని వైఎస్ఆర్ సిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎంతో కాలం నుండి ఎదురుచూస్తున్న గువ్వల చెరువు ఘాట్ టన్నెల్ నిర్మాణానికి 2024-2025 సంవత్సర ప్లాన్ లో రూ వెయ్యి కోట్ల నిధులతో అప్రూవల్ కావడం హర్షణీయమన్నారు. 2021 వ సంవత్సరంలో ఎంపీ మిథున్ రెడ్డి, తాను కలసి ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలసి నిధులు మంజూరు చేయాలని కోరడం జరిగిందన్నారు. ఇందుకు వెంటనే స్పందించిన నితిన్ గడ్కరీ గువ్వల చెరువు టన్నెల్ ఫైలును పరిశీలించాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. 2022 వ సంవత్సరంలో సర్వే చేయించారన్నారు. 2023 వ సంవత్సరంలో టెండర్ పిలవడం జరిగిందన్నారు. సర్వే ప్రకారం 6 కిమీ రోడ్డు ఉన్న రోడ్డులో ఇరువైపులా అప్రోచ్ రోడ్డు ,దాదాపు 2.50 కిమీ మేర టన్నెల్ వుంటుందన్నారు.కడప రోడ్డులోని సుగాలి బిడికి నుంచి ఘాట్ లోని ఆఖరి మలుపులో జాయిన్ అవుతుందన్నారు.ఈ డిసెంబర్ లోగా ఖచ్చితంగా టెండర్ పిలుస్తారని ఎన్ హెచ్ అధికారుల ద్వారా తెలుసుకున్నామన్నారు. టన్నెల్ నిర్మాణానికి సహకరించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కి ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. ఈ టన్నెల్ నిర్మాణం త్వరితగతిన పూర్తయితే రవాణా సౌకర్యం మెరుగవడమే కాకుండా, ప్రమాదాలు చాలా వరకు తగ్గి, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం చాలా వరకు తగ్గుతుందన్నారు. ఈ టన్నెల్ నిర్మాణం ఈ ప్రాంత వాసులకు మంచి శుభవార్త అని అన్నారు. ఈ సందర్భంగా ఎన్ హెచ్ అధికారులుకు కృతజ్ఞతలు తెలుపుచూ, టన్నెల్ నిర్మాణ పనులుకు సంబంధించి టెండర్ పక్రియను త్వరితగతిన పూర్తిచేసి, త్వరగా పనులును ప్రారంభించాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *