సిరా న్యూస్,విజయవాడ;
శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది తెలుగు నూతన సంవత్సర పండుగ సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరియు ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న తెలుగు ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుకుంటున్నానని ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు.
“ఉగాది” తెలుగు వారంతా సంతోషంగా, ఆనందంగా జరుపుకునే పండుగ. కొత్త సంవత్సరం మన ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తుంది, కొత్త ఆశలను చిగిరిస్తుంది. ‘శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది’ పండుగ మన సమాజంలోని అన్ని వర్గాల ప్రజలలో శాంతి, శ్రేయస్సు, సామరస్యం మరియు సంతోషాన్ని కలిగిస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. .”
================