మైనర్ బాలికపై వేధింపులు….ఫోక్సో కేసు నమోదు

సిరా న్యూస్,మచిలీపట్నం;
మైనర్ బాలికను లైంగికంగా వేధిస్తున్నాడన్న ఆరోపణల నేపథ్యంలో మచిలీపట్నంకు చెందిన సూర్యదేవర కన్నా జాషువా (50)పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు మచిలీపట్నం ఇన్ ఛార్జ్ సీఐ యేసుబాబు తెలిపారు.హైనీ హైస్కూల్ లో రికార్డ్ అసిస్టెంట్ గా పని చేస్తున్న జాషువా గత కొన్ని నెలలుగా హైస్కూల్ హాస్టల్ లో చదువుతున్న 9వ తరగతి విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *