సిరా న్యూస్,హనుమకొండ;
ప్రశాంత్ నగర్ లో బుధవారం హై డ్రామా నెలకొంది. వర్థన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, బీజేపీ లోకి చేరడానికి సిద్ధమైనట్లు వార్తలు రావడంతో ఉత్కంఠత నెలకొంది. అరూరి కి మాజీ మంత్రి హరీష్ రావు నుండి ఫోన్ వచ్చినట్లు సమాచారం. బుజ్జగింపుల కోసం అరూరి నివాసానికి బీఆర్ఎస్ పార్టీ దూతలు చేరుకున్నారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజి కుడా ఛైర్మెన్ సుందర్ రాజ్ యాదవ్ నేతృత్వంలో మంతనాలు జరిగాయి