సిరా న్యూస్, ఓదెల
ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
* డాక్టర్ హర్షిత్ కుమార్
* అబ్బిడిపల్లెలో ఉచిత వైద్య శిబిరం
ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ హర్షిత్ కుమార్ అన్నారు. శనివారం సదాశయఫౌండేషన్ ఆధ్వర్యంలో మెడికవర్ ఆసుపత్రి, కరీంనగర్ వారి సహకారంతో “ఉచిత వైద్య శిబిరం “ను , ఓదెల మండలం అబిడిపల్లె గ్రామపంచాయతీ కార్యాలయం లో నిర్వహించారు.ఇందులో 80 మందికి,.ఇసిజి,షుగర్ టెస్ట్, బి.పి పరీక్షలు ఉచితంగా చేసి అవసరమైన మందులను ఇచ్చారు. ఈ సందర్బంగా మెడికవర్ ఆసుపత్రి డాక్టర్ హర్షిత్ కుమార్, పి .ఆర్.ఒ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ వైద్య శిబిరం చేయుటకు అవకాశం ఇచ్చిన అబ్బిడిపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ, మాజీ సర్పంచ్ కోమలత శ్రీనివాస్ వారి కార్యవర్గానికి ,సదాశయఫౌండేషన్ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. పెరుగుతున్న ఎండల దృష్ట్యా తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు. ముఖ్య అతిథి బాస్కర్ (యం.పి.ఒ)మాట్లాడుతూ సదాశయఫౌండేషన్ సేవలను క్రితం నేను పనిచేసిన రామగిరి మండలంలోను చూశానని,అలాగే ఈమధ్యనే ఓదెల మండలం రాగానే వారి ఆద్వర్యంలో ఈ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొనడం సంతోషంగా ఉందన తెలిపారు. అబ్బిడిపల్లి నేత్రదానంలో రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచినందుకు అభినందనలు తెలిపారు.మరో విశిష్ట అతిథి శ్రీ. టి.శ్రవణ్ కుమార్ ,సదాశయఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు మాట్లాడుతూ అబ్బిడిపల్లి గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ కార్యవర్గం ,సెక్రటరీ ఆధ్వర్యంలో ఊరంతా నేత్రదానానికి ముందుకు వచ్చి రాష్ట్రంలో చరిత్ర సృష్టించి, మీడియా ద్వారా ప్రపంచానికి తెలిసి ఉన్నతంగా నిలిచారని కొనియాడారు. అలాగే రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ భీష్మాచారినేత ,ఓదెల మండలం అధ్యక్షుడు డాక్టర్ వేణు మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలో ఉన్న అబ్బిడిపల్లి గ్రామానికి వచ్చి ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన మెడికవర్ ఆసుపత్రి సిబ్బందికి, పిలవగానే హన్మకొండ నుండి వచ్చిన శ్రవణ్ కుమార్ కి,వైద్య శిబిరం చేయుటకు సహకారం అందించిన మాజీ సర్పంచ్ కోమల శ్రీనివాస్ కు,సెక్రటరీ యాసిన్ కు ధన్యవాదములు తెలియజేశారు.మాజీ సర్పంచ్ కోమలత,శ్రీనివాస్ మాట్లాడుతూ సదాశయఫౌండేషన్ అవగాహన, సహకారంతో నేత్ర,అవయవ,శరీరదానం పై చైతన్యమైన ఊరిప్రజలు నేత్రదానానికి ముందుకు రావడం వలన,మీడియా కవరేజ్ చేయడంతో రాష్ట్రములో ఊరు అగ్రభాగాన నిలిచిందని ,అలాగే ఊరిప్రజల మంచితనం దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఉచిత వైద్య శిబిరం చేపట్టిన సదాశయఫౌండేషన్ పెద్దలకు, మెడికవర్ ఆసుపత్రి పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సెక్రటరీ యాసిన్ ,మాజీ ఉప సర్పంచ్ నర్సింహరెడ్డి,వార్ఢుమెంబర్లు తిరుపతి,జింకిరి కోమల, సదాశయఫౌండేషన్ ప్రతినిధి మల్లేశం తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.