అందరినీ కలుపుకుంటా..విజయం సాధిస్తా

సిరా న్యూస్,విశాఖ;
ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ హైదరాబాద్ నుండి ఇండిగో విమానంలో విశాఖ విమానాశ్రయం చేరుకున్నారు. వైసిపి అధిష్టానం గాజువాక సమన్వయకర్తగా నియమించిన తర్వాతఅయన మొదటిసారిగా విశాఖ చేరుకున్నారు. భారీ సంఖ్యలో అమర్ కి ఘన స్వాగతం పలికేందుకు వైసిపి పార్టీ కార్యకర్తలు, అభిమానులు మహిళా నాయకులు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు.
అమర్నాథ్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఏ బాధ్యత అప్ప చెప్పినా ఆ బాధ్యత చేయడానికి అమర్నాథ్ ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. పోటీలో నిలబడి పోరాటం చేయడం పోటీనుంచి తప్పుకు నైనా జగన్ కోసమే పని చేస్తాను. అమర్ ని నా గుండెలో పెట్టుకొని మంచి చేస్తానని మాట జగన్మోహన్ రెడ్డి చెప్పారు. నేను పుట్టి పెరిగిన ప్రాంతంలో పోటీ చేసే అవకాశం జగన్మోహన్ రెడ్డి కల్పించారు. నియోజకవర్గంలో ఉన్న అందర్నీ కలుపుకుంటూ నాపై జగన్మోహన్ రెడ్డి ఉంచిన నమ్మకానికి గెలిచి గిఫ్ట్ గా ఇస్తానని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *