సిరా న్యూస్, ఆదిలాబాద్:
అడాణేశ్వర్ ఆలయంలో ప్రత్యేక వైద్య శిభిరం
+ అంకోలి పీహెచ్సీ ఆధ్వర్యంలో ఏర్పాటు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీలో గల అడాణేశ్వర్ ఆలయంలో అంకోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిభిరం నిర్వహించారు. ఆలయంలో కొనసాగుతున్న సప్తా వేడుకలకు మహారాష్ట్రలోని నాగ్పూర్, యవత్మాల్, పూసద్, నాందేడ్, పాటన్ బోరి, పూణే, నాసిక్, ముంబై, పాండ్రకౌడ నుంచే కాక జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు విచ్చేయడంతో వారి సౌకర్యార్థం వైద్య శిభిరం ఏర్పాటు చేసినట్లు సిబ్బంది తెలిపారు. జనవరి 7 నుంచి 15 వరకు నిర్వహిస్తున్న సప్తా కార్యక్రంలో భక్తులు ఆలయంలోనే వారం రోజుల పాటు బస చేస్తుండటంతో, ఉన్నత అధికారులు వెద్య శిభిరం నిర్వహణకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. దీంతో వైద్య సిబ్బంది ఆలయానికి విచ్చేసిన భక్తులకు పలు రకాల పరీక్షలు నిర్వహించి, మందులు అందజేసారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ బొమ్మెత సుభాష్, ఆడే సురేష్, ఎంఎల్హెచ్పీ బత్తుల సౌజన్య, భావన, ప్రియా, హెల్త్ అసిస్టెంట్లు డి. మమత, రాథోడ్ నారాయణ, ఆశా కార్యకర్తలు సురేఖ, జ్యోతి, నాసిక్, తదితరులు పాల్గొన్నారు.