సిరా న్యూస్, కుందుర్పి
వ్యక్తిగత పశుభ్రత పాటించాలి
* తిమ్మాపురంలో జగనన్న ఆరోగ్య సురక్ష
ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పశుభ్రత పాటించాలని డాక్టర్ ఆసియా డాక్టర్ ప్రవీణ్ డాక్టర్ పవన్ అన్నారు. శుక్రవారం కంబదూరు మండలం తిమ్మాపురం ఉన్నత పాఠశాల ఆవరణంలో శుక్రవారం ఆరోగ్య సురక్షిత జగనన్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా డాక్టర్ ఆసియా డాక్టర్ ప్రవీణ్ డాక్టర్ పవన్ ఎం పి ఓ హెచ్ ఈవో హుస్సేన్ హాజరయ్యారు. ప్రజలకు వారి వారి రోగాలను బట్టి వైద్యం అందించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎంపీడీవో ఆనంద్ పర్యవేక్షించారు. జగన్నా ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి భారీ స్పందన వచ్చినట్లు వైద్య సిబ్బంది తెలిపారు.