సిరాన్యూస్, సైదాపూర్
గుండెపోటుతో యువకుడి హఠాత్మారణం
సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో శుక్రవారం మారుపాక మహేష్ (30) అనే యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు.వివరాల్లోకి వెళితే వెన్నంపల్లి గ్రామంలో నివాసం ఉంటున్న మారుపాక మహేష్ డిగ్రీ చదువును పూర్తి చేశాడు.ప్రతిరోజూ కూలీ పనులు చేసుకుంటూ తన భార్య మారుపాక కల్యాణి (25)ఇద్దరు చిన్న పిల్లలను తన తల్లిదండ్రులను పోషించేవాడు. రోజువారి లాగే పనులకి వెళ్ళొచ్చిన మహేష్ గత రాత్రి నుండి త్రీవృ అస్వస్థత గురయ్యాడు.కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై ఉదయం ఆసుపత్రి కి తీసుకెళ్ళగా,ఆసుపత్రి లో వైద్యులు చికిత్స అందిస్తుండగా గుండెపోటుతో మృతి చెందాడు.చేతికి అందివచ్చిన కుమారుడు మరణించటం తో కుటుంబ సభ్యులు, బంధువులు,మిత్రులు శోఖసంద్రంలో మునిగిపోయారు.