సిరా న్యూస్, హైదరాబాద్:
సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేనకి గుండెపోటు..
మారుతున్న జీవనశైలితో అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈ మధ్యకాలంలో జనాలను భయపెడుతున్న సమస్య ఏదైనా ఉందంటే అది గుండెపోటు. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్ కు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. చిన్న పిల్లల నుంచి మొదలుకుని పెద్ద వయసు వారి దాక గుండెపోటుకు గురవుతున్నారు. అప్పటి దాక సరదాగా గడిపిన వారు ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన సీపీఎం నాయకుడు గుండెపోటుకు గురయ్యారు. కాగా తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనకు ఇంట్లో ఉన్న సమయంలో హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం తమ్మినేనిని హుటాహుటిన హైదరాబాద్కు ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.