సిరా న్యూస్,నంద్యాల;
రాష్ట్రంలో సార్వత్రిక ఏన్నికలు ధగ్గరకు సమీపిస్తుండటంతో శ్రీశైలం నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. ధ్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అష్టాధశ శక్తి పీఠ౦ కోలువైన నేలపై జెండా పాతెందుకు టీడీపీ, వైసీపీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఏలాగైనా ఈసారి శ్రీశైలం సీటును కైవసం చేసుకోవాలని బుడ్డా, శిల్పా కుటుంబాలు చాపకింద నీరులా పోలిటికల్ గేమ్ మొదలుపెట్టారు. గత కొంత కాలంగా ఏమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, టీడీపీ ఇంచార్జీ మాజీ ఏమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. శ్రీశైలం టికెట్ కోసం ఒకరిపై మరొకరు సవాళ్లు విసురుకుంటున్నారు. అభ్యర్థుల టికెట్ల కేటాయింపులో వైసీపీ దూకూడు పెంచగా టీడీపీ మాత్రం అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పటికే నాలుగో జాబితాను విడుధల చేసిన వైసీపీ అధిష్టానం తాజాగా ఐదవ జాబితా విడుదల చేసేంధుకు రంగం సిద్ధం చేసింది. ఐదవ జాబితాలో శ్రీశైలం టికెట్ అంశం ఉండవచ్చనే ఊహాగానాలు ఇప్పుడు శ్రీశైలం వైసీపీలో గంధరగోళం సృష్టిస్తున్నాయి.
ఈసారి యెన్నికల్లో శ్రీశైలం టికెట్ ను వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుడ్డా శేషారెడ్డి ఆశిస్తున్నారు. వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తనకు శ్రీశైలం టికెట్ ఇస్తానని గత ఎన్నికలలో హామీ ఇచ్చారని చెబుతున్నారు. టికెట్ కోసం బుడ్డా శేషారెడ్డి తాడేపల్లిలో మకాం వేశారట. ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో చర్చలు కూడా జరిపారట. దీంతో ఈసారి శ్రీశైలం టికెట్ శిల్పా చక్రపాణిరెడ్డికి ధక్కకపోవచ్చనే ప్రచారం నియోజకవర్గంలో జోరుగా సాగుతుంది. అయితే శిల్పా మాత్రం టికెట్ తనకే వస్తుందనే బహిరంగంగానే వెల్లడిస్తున్నారు. టిడిపి బుడ్డా కుటుంబం నుంచి బుడ్డారాజశేఖర రెడ్డికి టికెట్ మౌఖికఆదేశాలు ఉన్నట్లు సమాచారం. టీడీపీ అధికారక ప్రకటన మొదటి విడతలోనే వస్తూందని తెలుస్తుంది.దీంతో శ్రీశైలంలో బుడ్డా, శిల్పా కుటుంబాల మధ్య టికెట్ల లొల్లి మాటల యుద్ధానికి తెరలేపింది.