మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజికి భారీ వరద

పరవళ్లు తొక్కుతున్న గోదావరి, ప్రాణహిత నదులు
సిరా న్యూస్,జయశంకర్ భూపాలపల్లి;
మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ కి భారీగా వరద ప్రవాహాం పోటెత్తింది. బ్యారేజ్ లో పూర్తిగా 85 గేట్లు ఎత్తి వేసి దిగువకు నీటిని విడుదల చేసారు. ఇన్ఫ్లో,ఔట్ ఫ్లో 4,06,510 క్యూసెక్కులు. మరోవైపు, కాళేశ్వరం వద్ద గోదావరి,ప్రాణహిత నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వరద పోటెత్తింది. తీరం వద్ద 9 మీటర్ల ఎత్తులో పుష్కర ఘాట్ మెట్లను తాకుతూ నీరు ప్రవహిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *