సిరా న్యూస్,నిర్మల్;
నిర్మల్ జిల్లా భైంసా పట్టణం ప్రశాంతంగా ఉందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. నిన్న రాత్రి జరిగిన సంఘటనలో సీసీ ఫుటేజ్ ఆధారంగా 23 మందిని అదుపులోకి తీసుకొని వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదుచేసినట్లు తెలిపారు. ఇలాంటి ఉద్రేకాలకు దారితీసే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. భైంసా పట్టణం ప్రశాంతంగా ఉందని ఎలాంటి పుకార్లను నమ్మకుండా ప్రజలందరూ సంయమనం పాటించాలని సూచించారు. భైంసా పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు.
====================