సిరా న్యూస్,పల్నాడు;
ముప్పాళ్ళ మండలం తొండపి గ్రామంలో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలోమాజీ మంత్రి,టిడిపి నియోజకవర్గ ఇంచార్జ్ కన్నా లక్ష్మీనారాయణపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. దాడిలో గాయపడిన కన్నా లక్ష్మీనారాయణ వ్యక్తిగత సహాయకుడుకు సత్తెనపల్లి ప్రైవేటు వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు. గ్రామంలో మున్ముందు ఎటువంటి గొడవలు తలెత్తకుండా పోలీస్ పికేట్ ఎర్పాటు చేసారు.