సిరా న్యూస్,రాయదుర్గం;
రాయదుర్గం నియోజకవర్గం పరిధిలో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. రాయదుర్గం మండలం లో 85.4 m.m వర్షపాతం నమోదయింది . పట్టణంలో లోతట్టు ప్రాంతాలు, రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజల తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రాయదుర్గం పట్టణ లక్ష్మి బజార్ ప్రధాన ప్రధాన రహదారిపై ఉన్న షాపుల్లో వర్షం నీరు పోవడంతో భారీ ఆస్తి నష్టం జరిగింది. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో రైతులు హర్షం చేస్తున్నారు. పలు చెరువుల్లోకి వర్షపు నీరు చేరాయి. రైతులు సాగుచేసిన మొక్కజొన్న, పత్తి, టమాట, మిరప , తమలపాకు వంటి ఉద్యాన పంటలు నీటమునిగి దెబ్బతిన్నాయి.