స్థంభించిన జనజీవనం
సిరా న్యూస్,ఏలూరు;
రెండు రోజులుగా ఏజెన్సీ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఏలూరు జిల్లాలోని పోలవరం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, వేలేరుపాడు, కుక్కునూరు, తదితర గ్రామాలలో కు వెళ్లే రహదారులపై వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. బుట్టాయిగూడెం మండలం రెడ్డిగణపవరం నుంచి రామారావు పేట వెళ్లే రహదారి మధ్యలో జల్లేరు వాగు ఉధృతికి కాజ్వే కింద ఉన్న సిమెంట్ తూరలు కొట్టుకుపోయాయి. బుట్టాయిగూడెం మండలం కామవరం అటవీ ప్రాంతంలో ఉన్న శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం వద్ద వాగులు ఉదృతంగా ప్రవహించడంతో ఆలయానికి వెళ్లే మార్గాలు ఛిద్రం గా మారాయి. దీంతో ఆలయ కమిటీ సభ్యులు, గిరిజనులు కలిసి రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న భారీ వృక్షాలు జెసిబి సహాయం తో తొలగించి రాకపోకలకు వీలు కల్పించారు. మరో రెండు రోజులపాటు ఏజెన్సీలో వర్షాలు విస్తారంగా పడనున్న నేపథ్యంలో గిరిజన గ్రామాలకు రాకపోకలు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది.