సిరా న్యూస్,యాదాద్రి;
తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో భారీ వర్షం కురుస్తుంది. తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో.. యాదాద్రి టెంపుల్ సహా పరిసర ప్రాంతాలన్నీ తడిసి ముద్దయ్యాయి. వర్షం కారణంగా యాదాద్రి దిగవ భాగంతో పాటు ఘాట్ రోడ్లు కొండ పైన ఉన్న పార్కింగ్ ప్లేస్ యాదాద్రి పాములను అంతా జలమయమైంది. ఈ నేపథ్యంలో భక్తుల భద్రత దృష్ట్యా.. యాదాద్రి ఆలయ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఇప్పటివరకు యాదగిరిగుట్టలో అత్యధిక వర్షపాతం అంటే 116 మిల్లీమీటర్లు నమోదయింది