రోడ్డున పడ్డ అక్కాచెల్లెళ్లు
సిరా న్యూస్,మంథని;
మూడు రోజులుగా కురిపిస్తున్న వర్షాలకు మంథని పట్టణంలోని బోయిన్ పేటలో ఓ ఇల్లు నేలమట్టమయింది. ఆ ఇంట్లో నివసిస్తున్న తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు అక్క చెల్లెల్లు గూడు లేని వారిగా మిగిలారు.
పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ పరిధిలోని బోయిన్ పేటలో నివాసం ఉంటున్న కుంట సందీప, సమ్మక్క అనే ఇద్దరు అక్క చెల్లెల్లు ఈరోజు తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉండి శబ్దాలు రావడంతో హుటాహుటిన ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఈరోజు తెల్లవారుజామున ఆ ఇల్లు నేలమట్టం అయింది. సందీప, సమ్మక్కనే ఇద్దరు యువతుల చిన్నతనంలోనే అనారోగ్యంతో వారి తల్లిదండ్రులు ఒకరి తర్వాత ఒకరు మృతి చెందారు. చిన్ననాటి నుంచి వారు కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇప్పటికీ ఇద్దరు అక్క చెల్లెల్లు జీవనోపాధి కోసం చెరో పని చేసుకుంటూ ఉండగా గత మూడు రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలకు వారు నివసిస్తున్న పాత పెంకుటిల్లు కాస్త నేలమట్టం కావడంతో గూడు లేని అనాధలుగా మిగిలారు. విధి చిన్ననాడే తల్లిదండ్రులను దూరం చేయగా, ప్రకృతి నీడ లేకుండా చేయడంతో వారి రోదనలు మిన్నంటాయి. ప్రభుత్వం ఆదుకోవాలని, కట్టుకోవడానికి బట్టలు లేవని, తినడానికి తిండి లేదని రోడ్డు మీద పడ్డ అక్క
చెల్లెల్లు వేడుకుంటున్నారు.