కృష్ణా జిల్లాను ముంచెత్తిన ముసురు

 సిరా న్యూస్,విజయవాడ;
ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ముసురు ముంచేస్తోంది. ముఖ్యంగా విజయవాడ నగరంతో పాటు నందిగామ జగ్గయ్యపేట తిరువూరు మైలవరం ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తున్నాయి. జిల్లాల్లో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఎడితెరిపి లేన వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురవడంతో వాగులు పొంగిపొర్లుతున్నాయి .
విజయవాడలోని దుర్గగుడి కొండ చర్యలు వర్షానికి నాని విరిగి పడడంతో అధికారులు ఘాట్ రోడ్లు మూసివేశారు. గంపలగూడెం మండలం వెనిగడపలో తోటమల గ్రామాల మధ్య ఉన్న కట్టలేరు వాగు పై నుంచి వరద నీరు ప్రవహిస్తుంది. వరద నీరు ప్రవహించడంతో సుమారు 20 గ్రామాలకు పైగా రాకపోకలు నిలిచిపోయాయి. రెవెన్యూ మరియు పోలీస్ శాఖ అధికారులు కట్టలేరు వద్ద ఇరువైపులా భారీ గేట్లు ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *