పలు ప్రాంతాలు జలమయం
పరవళ్లు తొక్కుతున్న వాగులు, వంకలు
సిరా న్యూస్,విజయవాడ;
ఎన్టీఆర్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి కురిసిన వర్షానికి విజయవాడ నగరంలో లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయం అయ్యాయి. బెంజ్ సర్కిల్, నిర్మలా కాన్వెంట్, ఆటోనగర్ ప్రాంతాల్లో రహదార్లపైకి నీరు చేరింది. వాహనదారులు, ప్రయాణీకులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. చిట్టి నగర్ సొరంగం మార్గంలో వర్షం కారణంగా కొండ చరియలు విరిగి పడటంతో ప్రజలు వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు వర్షాకాలంలో పలుసార్లు ఇదే పరిస్థితి నెలకొన్న అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారు అంటూ స్థానికులు మండిపడుతున్నారు. రాత్రి నుంచి పడుతున్న అకాల వర్షాలకి కారణంగా భవానిపురం హెచ్పీ కాలనీ నందు ఇళ్లల్లోకి మురికి నీరు వచ్చి చంటి పిల్లలతో ఇబ్బంది పడుతున్న భవానిపురం వాసులు గత ప్రభుత్వం లో కూడా ఇలాంటి సందర్భాలు వచ్చి మాకు పులిహోర పొట్లాలు బిర్యానీ పొట్లాలు ఇచ్చి వెళ్లే వారే కానీ.. మాకు శాశ్విత పరిష్కారం కావాలి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పులిహోర పొట్లాలు బిర్యానీ పొట్లాలు కాకుండా మాకు శాశ్వత పరిష్కారం కావాలని భవానిపురం వాసులు కోరుకుంటున్నారు జిల్లా అంతటా దాదాపు వర్షాలు కురుస్తున్నాయి. కంచికచర్ల మండలం చెవిటికల్లు వద్ద లక్ష్మయ్య వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. చెవిటికల్లు బీసీ కాలనీలోకి వరద నీరు చేరింది. తిరువూరు పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షాలకు వాగులు,వంకలు పరవళ్లు తొక్కుతున్నాయి. తిరువూరు నియోజకవర్గంలోని కట్లేరు, ఎదుళ్ల, విప్ల, పడమటి, గుర్రపు, కొండ వాగులు పోటెత్తి ప్రవహిస్తున్నాయి. గంపలగూడెం మండలం వినగడప వద్ద రహదారిపై నుంచి కట్లేరు వరద ప్రవాహం పెరిగింది. ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. తిరువూరు పట్టణంలో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. బైపాస్ రోడ్డు జంక్షన్ నుంచి ఫ్యాక్టరీ సెంటర్ వరకు ప్రధాన రహదారి కాలువను తలపిస్తోంది. రెండు అడుగుల ఎత్తులో ప్రవహిస్తున్న వరద నీటిలో వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోకి భారీగా వర్షపు నీరు చేరింది. తిరువూరు మండలం వామకుంట్ల గ్రామంలో భారీ వర్షానికి వరదనీరు ఇళ్లల్లోకి చేరింది. పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు గ్రాముల కూచివాగు పొంగి ప్రవహిస్తుంది దీంతో సమీపంలో పంట పొలాలు నేత మునిగాయి లింగగూడెం గ్రామానికి గండి వాగు పొంగి ప్రహించడంతో రెండు రోజుల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి